ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 2,100 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూలై 5, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,05,023 కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి 583, చిత్తూరులో 316, పశ్చిమగోదావరిలో 217, ప్రకాశంలో 176 నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మరో 3,435 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో 26 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 12870 కి పెరిగింది. గత 24 గంటల్లో 72,731 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 2,24,35,809 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (జూలై 5, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 19,05,023
- కొత్తగా నమోదైన కేసులు : 2,100
- కొత్తగా నమోదైన మరణాలు : 26
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 18,58,189
- యాక్టీవ్ కేసులు : 33,964
- మొత్తం మరణాల సంఖ్య : 12870
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ