ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 3892 పాజిటివ్ కేసులు, 28 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 14, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,67,465 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 6319 కి పెరిగింది. మరో 5050 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 69,463 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
కరోనా వలన చిత్తూరులో నలుగురు, కృష్ణాలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, తూర్పుగోదావరిలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, కర్నూల్ లో ఒకరు, విజయనగరంలో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6319 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (అక్టోబర్ 14, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 67,72,273
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 7,67,465
- కొత్తగా నమోదైనా కేసులు : 3892
- నమోదైన మరణాలు : 28
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 7,19,477
- యాక్టీవ్ కేసులు : 41669
- మొత్తం మరణాల సంఖ్య : 6319
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu