ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7665 పాజిటివ్ కేసులు, 80 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 10, సోమవారం ఉదయం 10 గంటల వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 235525 కు, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 2116 కి చేరింది. మరో 6924 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు. గత 24 గంటల్లో 46999 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
కరోనా వలన గత 24 గంటల్లోనే ప్రకాశంలో పదకొండు మంది, గుంటూరులో పది మంది, పశ్చిమగోదావరిలో తొమ్మిది మంది, కడపలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూల్ లో ఆరుగురు, అనంతపూర్ లో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2116 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 10, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 25,34,304
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 235525
- కొత్తగా నమోదైనా కేసులు : 7665
- నమోదైన మరణాలు : 80
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 145636
- యాక్టీవ్ కేసులు : 87773
- మొత్తం మరణాల సంఖ్య : 2116
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu