ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 54,970 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,178 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా చిత్తూరులో 204, నెల్లూరులో 177, కృష్ణాలో 151, గుంటూరులో 135, పశ్చిమగోదావరిలో 124, ప్రకాశంలో 118 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,23,242 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 10 మరణాలు చోటుచేసుకున్నాయి. కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, తూర్పుగోదావరిలో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13935 కి పెరిగింది. గత 24 గంటల్లో 1,266 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 19,94,855 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,452 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ