ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో గురువారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు విజయవంతం కావడం, ప్రశాంత వాతావరణంలో జరగడం పట్ల సీఎస్, డీజీపీలను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ అభినందించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు మెరుగైన చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. అలాగే మిగిలిన మూడు విడతల పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కూడా సీఎస్, డీజీపీలతో ఎస్ఈసీ చర్చించారు. అనుసరించాల్సిన విధివిధానాలు, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు ఇచ్చారు. కాగా రాష్ట్రంలో ఫిబ్రవరి 13 న రెండో విడత, 17 న మూడో విడత, 21 న నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ