తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఏర్పడి 40 సంవత్సరాలు అయిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ 40 ఏళ్ల ప్రస్థానం లోగోను ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు దీనిని నిరసిస్తూ ఎన్టీఆర్ పార్టీ పెట్టారన్నారు. సినిమా రంగంలో నెం 1 గా ఉన్నా కూడా అన్నీ వదిలేసి రాజకీయాలలోకి వచ్చారని గుర్తుచేశారు. పేద ప్రజలకు ఏదైనా చేయాలన్న భావనతో కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారన్నారు. అప్పటికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో అంతగా గుర్తింపునకు నోచుకోని బీసీలకు, అణగారిన వర్గాలకు రాజకీయంగా గుర్తింపు తెచ్చిన పార్టీ టీడీపీ అని ఆయన తెలిపారు.
ఎంతోమంది ఉన్నత విలువలు కలిగిన నాయకులను తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో చూశానని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి అమాయకులైన ప్రజలు చనిపోతే, మరణాలను సహజమరణాలుగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంత బాధ్యతలేని ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. మద్యం కల్తీ బ్రాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రానికి ప్రధాన జీవనది పోలవరం ప్రాజెక్ట్ అని, చివరికి దానిని కూడా పూర్తిచేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. పోలవరం ఖర్చు ఆర్అండ్ఆర్ బాధ్యతంతా కేంద్రానిదేనని, డయాఫ్రమ్ వాల్పై అవగాహన లేకుండానే సభలో అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతున్నారని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ