ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 4వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. దేశంలో జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. అలాగే అనంతరం భీమవరంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ భీమవరం పర్యటనపై సంబంధిత అధికారులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ప్రధాని పర్యటనకు నెలరోజులు సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుంచే ప్రణాళికను రూపొందించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రధాని పర్యటన ప్రారంభం నుంచి అల్లూరి విగ్రహావిష్కరణ, బహిరంగ సభ, తిరుగు ప్రయాణం వరకు సంబంధించిన రూట్ మ్యాప్ ప్రకారం పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఇతర శాఖల అధికారులను సీఎస్ సమీర్ శర్మ ఆదేశించారు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF