తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు నేడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా దేవరకద్ర, కొడంగల్ నియోజకవర్గాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ క్రమంలో దేవరకద్ర మండలంలోని వెంకపల్లిలో రూ. 55 కోట్లతో చేపట్టిన పేరూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో మహబూబ్నగర్ జిల్లా బంజరు భూములు, ఎండిన బావులకు మారుపేరుగా ఉండేదని, ఈ పరిస్థితుల వలన చాలా మంది జీవనోపాధి కోసం వలసలు వెళ్లేవారని అన్నారు. అయితే మన తెలంగాణ రాష్ట్రం సిద్దించాక ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో గ్రామాలలో చెరువుల పునరుద్ధరణతో పాటు కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి కరువును పారదోలారని పేర్కొన్నారు. నేడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు నీటితో కళకళలాడుతున్నాయని చెప్పారు. అనంతరం వర్నే-ముత్యాలపల్లి రోడ్డుపై బ్రిడ్జితో పాటు గుడిబండకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్ మున్సిపాలిటీలోని అమిస్తాపూర్ (సిద్దాయపల్లి) వద్ద నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF