ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 సంవత్సరానికి గాను రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు రెండో శనివారం సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 2022-23 సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు మరియు సూచనలతో పాటు సెలవులు మరియు విద్యా సంవత్సరంలో పని దినాలను ప్రకటించింది. నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల యాజమాన్యాలకు సెలవు దినంగా అకడమిక్ క్యాలెండర్ డిక్లరేషన్ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు నెలలో రెండో శనివారం సెలవు ఉంటుందని ఉత్తర్వులలో స్పష్టం చేసింది. ఈ నెల నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొంది. అలాగే ప్రైవేటు పాఠశాలల్లో ప్రైవేటు తరగతులు, సెషన్లు వంటివి కూడా నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కావున రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు మరియు అన్ని జిల్లా విద్యాశాఖాధికారులు పై సూచనలను ఖచ్చితంగా పాటించవలసిందిగా ఆదేశించింది. ఎవరైనా ఈ నిబంధనను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్య తీసుకోబడుతుందని హెచ్చరించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ