రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో ఆన్లైన్ లో జూమ్ యాప్ ద్వారా మహానాడు ను మే 27, 28 వ తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించాలని టీడీపీ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే పార్టీ కార్యాలయానికి సంబంధిత రెవెన్యూ అధికారులు కొవిడ్ నోటీసులు పంపించారు.
మహానాడు నిర్వహణ సందర్భంగా కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని ఆ నోటీసులో సూచించారు. ఈ నోటీసు మంగళగిరి తహసీల్దార్ పేరిట జారీచేసినట్టుగా తెలుస్తుంది. ఆత్మకూరు వీఆర్వో ద్వారా టీడీపీ కార్యాలయ కార్యదర్శి రమణకు ఈ నోటీసులు అందజేశారు. మరోవైపు మహానాడు కార్యక్రమంలో జూమ్ యాప్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 14 వేల మందికి పైగా పాల్గొంటున్నారని పార్టీ సభ్యులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu