దేశవ్యాప్తంగా నిన్నటి నుంచి అమలులోకి వచ్చిన వంట గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై టీఆర్ఎస్ పార్టీ మండిపడింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు ధరల పెంపుపై ఈరోజు నిరసన తెలపాలని టీఆర్ఎస్ కేడర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు సూచించారు. ఈ నిరసన కార్యక్రమాలలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనాలని కోరారు.
అలాగే జిల్లాల స్థాయిలో పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తమ పరిధిలో నిరసన తెలపాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలు పెంచి సామాన్యుల వెన్ను విరుస్తోందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గృహావసరాల కోసం వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్పై రూ. 50 మేర పెంచుతూ ఇంధన కంపెనీలు ప్రకటన చేశాయి. దీని కారణంగా హైదరాబాద్లో సిలిండర్ ధర రూ. 1,055 నుంచి రూ. 1,105కు చేరుకుంది. ఈ నేపథ్యంలో దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరుతూ అధికార టీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ