ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. బుధవారం ఉదయం విజయవాడలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం 2,06,648 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, పరీక్షలకు 1,91,846 మంది విద్యార్థులు (బాలురు-1,09,413, బాలికలు-82413) హాజరయ్యారని తెలిపారు. వారిలో 1,23,231 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని, 64.23 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. 66544 మంది బాలురు అనగా 60.83 శాతం, 56677 బాలికలు అనగా 68.76 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి తెలిపారు. 22,236 మంది ఫస్ట్ డివిజన్ లో, సెకండ్ డివిజన్ లో 46,725, థర్డ్ డివిజన్ లో 54,249 పాస్ అయ్యారని చెప్పారు. అలాగే ఫలితాల్లో ప్రకాశం జిల్లా 87.52 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, పశ్చిమగోదావరి జిల్లా 46.66 శాతంతో ఆఖరిస్థానంలో నిలిచింది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ మంత్రి బొత్స సత్యనారాయణ అభినందలు తెలియజేశారు.
ఫలితాలను https://www.bse.ap.gov.in/ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. ముందుగా రాష్ట్రంలో జూలై 6 నుంచి 15 వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. కరోనా మహమ్మారి వలన ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా ఈసారి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాసి పాసైన వారిని కూడా ఏప్రిల్-2022 రెగ్యులర్ బ్యాచ్ లో పాసైన విద్యార్థులతో సమానంగానే పరిగణిస్తూ, గ్రేడ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY