విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం నాడు బీసీ సంక్రాంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో బీసీల సంక్షేమం కొరకు 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా, జనాభా ప్రాతిపదికన 56 బీసీ కార్పోరేషన్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీ సంక్రాంతి పేరుతో నిర్వహించిన ఈ సభలో 56 బీసీ కార్పోరేషన్ల చైర్మన్ లు, వాటికీ సంబంధించిన 672 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. బీసీ సంక్రాంతి సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతిరావ్ పూలే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు సీఎం వైఎస్ జగన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అలాగే ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎంలు ధర్మాన కృష్ణ దాస్, అంజాద్ బాషా, రాష్ట్ర మంత్రులు బొత్ససత్యనారాయణ, సీదిరి అప్పల్ రాజు, అవంతి శ్రీనివాస్, కొడాలి నాని,పేర్ని నాని, కన్నబాబు, వేణుగోపాల కృష్ణ, శంకర్ నారాయణ, ఆదిమూలపు సురేష్, గుమ్మడి జయరాం, అనిల్ కుమార్ యాదవ్, వైసీపీ ఎంపీలు సుభాష్ చంద్రబోస్, భరత్, నందిగాం సురేష్, బాల శౌరి, మోపిదేవి వెంకట రమణ, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు హాజరై ప్రసంగించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ