ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే ఉత్తర్వులను “ఏపీ ఈ-గెజిట్” ద్వారా ప్రజలకు తిరిగి అందుబాటులో ఉంచనున్నారు. జీవో ఐఆర్ వెబ్సైట్ ను నిలిపివేయడంతో సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలగకుండా ఏపీ ఈ-గెజిట్ లో ప్రభుత్వ ఉత్తర్వులను ఉంచనున్నన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని మాత్రం ఏపీ ఈ-గెజిట్లో అందుబాటులో ఉంచబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ