ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు పంపినట్టు గవర్నర్ కార్యదర్శి ధృవీకరించారు. ఆమె వ్యక్తిగత కారణాల వలనే రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 26, 2018న ఉత్తరాఖండ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన బేబీ రాణి మౌర్య, గత నెలలోనే మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు, అయితే మరో రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉండగానే ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ