కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు ఉన్న నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తునట్టు ప్రకటించింది. నైట్ కర్ఫ్యూ సెప్టెంబర్ 4వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. నైట్ కర్ఫ్యూ పొడిగింపుపై ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు తెలిపారు. ప్రజలందరూ కరోనా ప్రోటోకాల్స్, నైట్ కర్ఫ్యూ నిబంధనలు పాటిం చాలని సూచించారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ