సమైక్య పాలనలో వలసలకు ఆకలి చావులకు నిలయమైన పాలమూరు జిల్లా స్వయం పాలనలో పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా అందిస్తున్న సాగునీటి జలాలతో నేడు ఎటు చూసినా పచ్చని పంటలతో కనువిందు చేస్తున్నదన్నారు. బీడు భూములు రాల్లు గుట్టలకే ఇన్నాల్లూ పరిమితమై వున్న పాలమూరు పచ్చదనంతో తన రూపు రేఖలను మార్చుకుని, వినూత్న రీతిలో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుండడం సంతోషకరమన్నారు.
తెలంగాణకు హరితహారం స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా, సీడ్ బాల్స్ ను రికార్డు స్థాయిలో తయారు చేసి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వెదజల్లడం, సీడ్ బాల్స్ తో అత్యంత పొడవైన వాక్యాన్ని నిర్మించడం ద్వారా సాధించిన “గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు” జ్ఞాపికను శుక్రవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు అందుకున్నారు. ఈ సందర్భంగా వారి కృషిని సీఎం కేసీఆర్ అభినందించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పచ్చదనాన్ని సాధించే దిశగా రికార్డు స్థాయిలో, 10 రోజుల్లో 2 కోట్ల పది లక్షల సీడ్ బాల్స్ ను తయారు చేసి కొండలు గుట్టల ప్రాంతాల్లో వెదజల్లడం ద్వారా పచ్చదనం అభివృద్ధికి పాటుపడుతున్న పాలమూరు జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాల కృషిని సీఎం కేసీఆర్ అభినందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ