ఆయనా.. ఓ ఎన్నారై.. 20 ఏళ్లలో లోకల్ గా కనిపించింది అంతంతమాత్రమే.. ఆయనా.. ఓ డాక్టర్.. రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగింది ఈ మధ్యనే.. అయినా.. ఎందుకీ ప్రభంజనం.. ఆ టీడీపీ అభ్యర్థి.. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కార్యక్రమాలకు అంత జనం ఎలా?.. డబ్బు బాగా ఖర్చుపెడుతున్నాడా.. మనమూ చేస్తున్నాంగా.. మనకు ఎందుకు రావడం లేదు జనం.. ఇన్నేళ్లుగా మనం ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాం.. మనకు లేని బలం.. ఆయనకు ఎక్కడిది.. రోజురోజుకూ పెమ్మసాని స్ట్రాంగ్ ఎలా అవ్వగలుగుతున్నాడు.. అడ్డుకట్ట వేయడం ఎలా..? – గుంటూరు లోక్సభ తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురించి వైసీపీ శిబిరాల్లో జరుగుతున్న చర్చ ఇది.
విదేశాల్లో వైద్య, వ్యాపార రంగంలో స్థిరపడిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. మొదటి నుంచీ తెలుగుదేశం అభిమాని. ఆ పార్టీ కార్యకర్త. ఆ తర్వాత ఎన్నారై విభాగ కార్యకలాపాలు చూస్తూ.. పార్టీకి అర్థికంగా అండదండలు అందిస్తూ వచ్చేవారు. రాష్ట్ర విభజన అనంతరం నరసరావుపేట పార్లమెంట్ సీటు ఆశించి.. ఆంధప్రదేశ్కు విచ్చేశారు. నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ సీటును పార్టీ వేరే ఒకరికి కేటాయించాల్సి వచ్చింది. దీంతో ఆయన మళ్లీ అమెరికా వెళ్లిపోయారు. గతంలో ఆయనను నిరాశపరచిన నేపథ్యంలో.. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ.. పిలిచి మరీ సీటు ఇచ్చింది. సేవా కార్యక్రమాల ద్వారా స్థానికంగా ఆయనకు ఉన్న పేరు కలిసివస్తుందని భావించింది. గుంటూరు లోక్సభ నుంచి నిలబడాలని ఆదేశించింది. ఈక్రమంలో పెమ్మసాని ఐదు నెలల క్రితమే.. గుంటూరుకు వచ్చారు. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
గుంటూరు పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం శ్రేణులను, జనసేన కార్యకర్తలను ఒకతాటిపైకి తెచ్చారు. అందరినీ కలుపుకుని ఐక్యంగా ముందుకు సాగుతున్నారు. అప్పటికే పెమ్మసాని స్థానికంగా చేపడుతున్న సేవా కార్యక్రమాల నేపథ్యంలో ఆయనకు ప్రజల ఆదరణ లభిస్తోంది. ఈనేపథ్యంలో ఆయన చేపడుతున్న పాదయాత్రలు, సభలు, సమావేశాలు.. సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా తెలుగుదేశం జెండానే కనిపిస్తోంది. దీంతో విపక్ష పార్టీ వైసీపీ శిబిరంలో అలజడి మొదలైంది. పెమ్మసాని స్ట్రాంగ్ అవుతున్న తీరుపై పరిశీలన జరుపుతోంది. టీడీపీ అభ్యర్థి వేస్తున్న ఎత్తులకు పైఎత్తులు వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఇప్పటికే పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు లోక్సభ పరిధిలో బలంగా పాతుకుపోయారు. ప్రజల్లో మంచి ముద్ర వేసుకున్నారు. సర్వేలు కూడా పెమ్మసాని గెలుపు ఖాయం అని చెబుతున్నాయి. ఈనేపథ్యంలో వైసీపీ ప్రయత్నాలు ఫలిస్తాయా..? వేచి చూడాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE