ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆగస్టు 7, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీచేశారు. 25 జిల్లాల ఏర్పాటుకు ఈ కమిటీ అధ్యయనం చేయనుండగా, సీఎస్ నీలం సాహ్న అధ్యక్షత వహించనున్నారు. సీసీఎల్ఏ కమిషనర్, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ, ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి ఈ కమిటీలో సభ్యలుగా ఉండనుండగా, కమిటీ కన్వీనర్గా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ వ్యవహరించనున్నారు. అలాగే మూడు నెలలలోగా తుది నివేదికను అందించాలని పభుత్వం కమిటీకి గడువు విధించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu