ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యసేవలు అందిస్తున్న ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు మంగళవారం నాడు నిధులు విదుదల చేశారు. మొత్తం 573 ఆసుపత్రులకు రూ.148.37 కోట్ల నిధులు విడుదల చేసినట్లుగా ఆరోగ్యశ్రీ సీఈఓ మల్లీఖార్జున వెల్లడించారు. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి హెల్త్ స్కీం కింద మొత్తం 544 ఆసుపత్రులకు 31.97 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఆలస్యం చేయకుండా ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల చేస్తున్నట్లు సీఈఓ మల్లీఖార్జున పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu