2.5 ఎకరాలకు ఒక ఉచిత బోరు, వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఉచిత బోరు పథకం

AP Free Borewell Scheme, AP Govt Announces Free Borewell Scheme, AP Govt Announces Free Borewell Scheme to Farmers, Free Borewell Scheme In AP, Free Borewell Scheme to Farmers Under Rythu Bharosa, Rythu Bharosa, YSR Rythu Bharosa Centers, YSR Rythu Bharosa Scheme

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయరంగానికి సంబంధించి మరో పథకానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్రంలో సన్న, చిన్న కారు రైతులను ఆదుకునేందుకు ఉచిత బోరు పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ కింద రైతుల పంట పొలాల్లో ఉచితంగా బోర్లు వేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జూలై 4, శనివారం నాడు ఉత్తర్వులు జారీచేసింది.

ఉచిత బోరు పథకానికి విధివిధానాలు:

  • 2.5 ఎకరాలకు ఒక ఉచిత బోరు వేయనున్నారు.
  • ఒక్కరికే అంత భూమి లేకపోతే పక్కన పొలం వారితో కలిసి గ్రూపుగా ఏర్పడొచ్చు.
  • ముందుగా ఆయా భూమిల్లో ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు.
  • 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఉచిత బోర్లు. 
  • అర్హత గల రైతులు గ్రామ సచివాలయాల్లో పట్టాదారు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డుల ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి.
  • పలు స్థాయిల్లో దరఖాస్తు పరిశీలన అనంతరం ఉచిత బోరు మంజూరు విషయాన్ని గ్రామ సచివాలయం ద్వారా రైతుకు తెలియజేస్తారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 7 =