ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయరంగానికి సంబంధించి మరో పథకానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్రంలో సన్న, చిన్న కారు రైతులను ఆదుకునేందుకు ఉచిత బోరు పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ కింద రైతుల పంట పొలాల్లో ఉచితంగా బోర్లు వేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జూలై 4, శనివారం నాడు ఉత్తర్వులు జారీచేసింది.
ఉచిత బోరు పథకానికి విధివిధానాలు:
- 2.5 ఎకరాలకు ఒక ఉచిత బోరు వేయనున్నారు.
- ఒక్కరికే అంత భూమి లేకపోతే పక్కన పొలం వారితో కలిసి గ్రూపుగా ఏర్పడొచ్చు.
- ముందుగా ఆయా భూమిల్లో ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు.
- 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఉచిత బోర్లు.
- అర్హత గల రైతులు గ్రామ సచివాలయాల్లో పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డుల ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి.
- పలు స్థాయిల్లో దరఖాస్తు పరిశీలన అనంతరం ఉచిత బోరు మంజూరు విషయాన్ని గ్రామ సచివాలయం ద్వారా రైతుకు తెలియజేస్తారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu