దేశంలో కరోనా పరీక్షల్లో 3 వ స్థానంలో నిలిచిన ఏపీ

Andhra Pradesh, Andhra Pradesh Coronavirus Testing, Andhra Pradesh Stands at Number 3, Andhra Pradesh Stands at Number 3 In Coronavirus Testing, AP Corona Positive Cases, AP Coronavirus, AP Coronavirus Testing Laboratories, AP COVID 19 Cases, AP Total Positive Cases, Coronavirus testing

రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 5, ఆదివారం ఉదయం 10 గంటల వరకు 10,17,140 పరీక్షలు నిర్వహించి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో జూలై 4 నాటికీ 13,06,884, మహారాష్ట్రలో జూలై 5  నాటికీ 11,66,112 పరీక్షలు నిర్వహించారు.

మరోవైపు ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 18697 కు చేరింది. అలాగే రాష్ట్రంలో ఈ వైరస్ వలన మరణించిన వారి సంఖ్య 232 కి చేరింది. ఇప్పటికే 8422 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7907 మంది ఆసుపత్రుల్లో, 2136 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 10043 మంది చికిత్స పొందుతున్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =