ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కేసులో హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఇటీవల ఉద్యోగులు తమ వేతనాలకు సంబంధించి గవర్నర్ను కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీరియస్ అయిన ఏపీ సర్కార్ వారు ‘రోసా’ నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ ఆ ఉద్యోగులకు షో కాజ్ నోటీస్ జారీ చేసింది. వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ వారినుంచి వివరణ కోరింది. దీంతో ఉద్యోగులు ఇందులో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ అంశంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిలో తుది తీర్పు వెలువరించేవరకూ షో కాజ్ నోటీసుల ఆధారంగా ఆయ ఉద్యోగ సంఘాలపై మరియు ఉద్యోగులపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని సూచించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE