ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 615 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా పశ్చిమగోదావరిలో 134, తూర్పుగోదావరిలో 103, కృష్ణాలో 102, గుంటూరులో 66 నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 15, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,13,827 కు, మరణాల సంఖ్య 14702 కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 2,787 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 22,86,575 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,550 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(615):
- పశ్చిమగోదావరి – 134
- తూర్పుగోదావరి – 103
- కృష్ణా – 102
- గుంటూరు – 66
- విశాఖపట్నం – 50
- ప్రకాశం – 37
- చిత్తూరు – 29
- అనంతపురం – 29
- నెల్లూరు – 24
- కడప – 15
- కర్నూల్ – 14
- శ్రీకాకుళం – 7
- విజయనగరం – 5
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ