ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను ఏపీ ఎస్ఎస్సీ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. మరోవైపు పదో తరగతి పరీక్షలను కేవలం ఆరు పేపర్లతోనే ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పరీక్షల విధానంలో భాగంగా సీబీఎస్ఈ తరహాలో రోజువిడిచి రోజు పరీక్షలను నిర్వహించనున్నారు.
ఏపీలో పదో తరగతి-2023 పరీక్షల షెడ్యూల్:
- ఏప్రిల్ 3: ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1, ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (కంపోజిట్ కోర్స్)
- ఏప్రిల్ 6: సెకండ్ లాంగ్వేజ్ పేపర్
- ఏప్రిల్ 8: ఇంగ్లీష్ పేపర్
- ఏప్రిల్ 10: మ్యాథమేటిక్స్ పేపర్
- ఏప్రిల్ 13: సైన్స్ పేపర్
- ఏప్రిల్ 15: సోషల్ స్టడీస్ పేపర్
- ఏప్రిల్ 17: ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
- ఏప్రిల్ 18: ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్), ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్స్ థియరీ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE