అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు: ఏపీ నుంచి చెన్నైకి నవంబర్ 25 న ప్రారంభం

Andhra Pradesh State Road Transport Corporation, APSRTC, APSRTC BUS Services, APSRTC Bus Services to Start to Tamilnadu, APSRTC Bus Services to Start to Tamilnadu from November 25th, APSRTC Bus Services to Tamilnadu, APSRTC Latest News, APSRTC News, APSRTC to resume bus services to Tamil Nadu, from November 25th, Mango News Telugu, Tamilnadu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముందుగా కర్ణాటకకు, ఇటీవలే తెలంగాణ రాష్ట్రానికి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు రాష్ట్రానికి కూడా బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. నవంబర్ 25 నుంచి చెన్నై కు ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత మార్చి 21 నుంచి తమిళనాడు రాష్ట్రానికి బస్సు సర్వీసులు నిలిపివేశారు. అయితే ఏపీ నుంచి చెన్నై నగరానికి వెళ్లే ప్రజలు సంఖ్య ఎక్కువుగా ఉండడంతో బస్సులు ప్రారంభానికి ఇటీవల ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తమిళనాడు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గతంలో ఏపీ నుంచి చెన్నైకి 273 బస్సు సర్వీసులు తిరగగా, ప్రస్తుతం కరోనా నిబంధనలకు అనుగుణంగా దశలవారీగా చెన్నైకు బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ సన్నాహాలు చేస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 20 =