ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఆయన్ను హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ముందుగా నవంబర్ 15న గవర్నర్ కరోనా బారినపడడంతో ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన విషయం తెలిసిందే. అనంతరం ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనా నెగెటివ్ రావడం, ఆరోగ్యపరిస్థితి మెరుగుపడడంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయి విజయవాడలోని రాజ్ భవన్ కు చేరుకున్నారు. కాగా ఆదివారం రాత్రి గవర్నర్ మరోసారి అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం ప్రత్యేక విమానంలో మరోసారి హైదరాబాద్ కు తీసుకెళ్లినట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ