రాజధానిపై సీఎం జగన్ కు నివేదిక సమర్పించిన బీసీజీ

Andhra Pradesh Latest News, AP Breaking News, AP Capital Issue, AP CM YS Jagan, AP Political Live Updates 2020, Ap Political News, AP Political Updates, AP Political Updates 2020, Boston Consulting Group Report On AP Capital, Mango News
రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జనవరి 3, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. బీసీజీ సభ్యులు ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలుసుకుని రాజధానిపై పూర్తి స్థాయి నివేదిక అందజేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనం చేసింది. ఇప్పటికే రాజధాని అంశంపై జీఎన్‌ రావు కమిటీ నివేదిక సమర్పించగా, రాష్ట్ర మంత్రివర్గం సైతం చర్చ జరిపిన సంగతి తెలిసిందే. ఇక జీఎన్‌రావు కమిటీ నివేదికతో పాటుగా, బీసీజీ నివేదికను సైతం ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ అధ్యయనం చేయనుంది. జనవరి 6వ తేదీన రెండునివేదికల పరిశీలన కోసం హైపవర్‌ కమిటీ భేటీ కానుంది. అలాగే జనవరి 20వ తేదీలోగా హైపవర్‌ కమిటీ ప్రభుత్వానికి తుది నివేదికను అందించనుంది. హైపవర్ కమిటీ సిఫార్సులను బట్టే రాజధానిపై నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తునట్టు తెలుస్తుంది.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 4 =