మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ నేతలు, ఎంపీలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించడం, త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానాలు, ఇతర అంశాలపై కీలకంగా చర్చించారు. టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతారామలక్ష్మీ ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు భేటీ కానున్నారు. గత 42 రోజులుగా రాజధాని అమరావతి రైతుల చేసున్న ఆందోళనలు, శాసన మండలి రద్దు, రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా అమరావతి జేఏసీతో కలిసి చేపట్టే కార్యక్రమాలు వంటి పలు అంశాలపై ఈ భేటీలో పార్టీ నాయకులతో చంద్రబాబు చర్చించనున్నారు.
[subscribe]