టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీ

Chandrababu Meeting With Party MPs and Leaders,Andhra Pradesh Latest News, AP Breaking News, AP Panchayat Office, Ap Political Live Updates, Ap Political News, latest political breaking news, Mango News,TDP Chandrababu Meeting,Chandrababu Party MPs and Leaders Meeting
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ నేతలు, ఎంపీలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించడం, త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానాలు, ఇతర అంశాలపై కీలకంగా చర్చించారు. టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతారామలక్ష్మీ ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు భేటీ కానున్నారు. గత 42 రోజులుగా రాజధాని అమరావతి రైతుల చేసున్న ఆందోళనలు, శాసన మండలి రద్దు, రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా అమరావతి జేఏసీతో కలిసి చేపట్టే కార్యక్రమాలు వంటి పలు అంశాలపై ఈ భేటీలో పార్టీ నాయకులతో చంద్రబాబు చర్చించనున్నారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + twelve =