విశాఖ ఉక్కు‌ ప్రైవేటీకరణ: మంత్రి కేటీఆర్ తో టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు భేటీ

Andhra MLA Ganta Talks With Telangana Minister KTR, Ganta Srinivasa Rao, Ganta Srinivasa Rao Latest News, Ganta Srinivasa Rao meets KTR, Ganta srinivasa rao Meets Minister KTR, Hyderabad, KTR, Mango News, Minister KTR, TDP Leader Ganta Srinivasa Rao, TDP Leader Ganta srinivasa rao Meets Minister KTR, TDP Vizag North MLA Ganta meets KTR in Hyd, Telangana Minister KTR

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను శనివారం నాడు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిశారు. ఈ భేటీ అసెంబ్లీ ప్రాంగణంలోని కార్యాలయంలో జరిగింది. ఈ భేటీపై గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ “విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి తన మద్దతు తెలిపిన మంత్రి కేటీఆర్ ను కలసి ధన్యవాదాలు తెలియజేసాను, అదేవిధంగా విశాఖ ఉక్కు ఉద్యమానికి ప్రత్యక్ష మద్దతు తెలియజేయాలని కోరగా, అసెంబ్లీ సమావేశాల తరువాత సీఎం కేసీఆర్ తో చర్చించి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు మరియు మంత్రులతో కలసి వచ్చి ఉద్యమంలో పాల్గొంటామని మంత్రి కేటీఆర్ తెలియజేశారు” అని పేర్కొన్నారు

ఏపీలో విశాఖ ఉక్కు పరిశ్రమ‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్ధతు తెలుపుతున్నట్లు ఇటీవల మంత్రి కేటీఆర్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు పరిశ్రమ‌ ప్రైవేటీకరణ చేయాలనీ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఈ విషయంలో అవసరమైతే సీఎం కేసీఆర్‌ అనుమతితో విశాఖ వెళ్లి మద్దతిస్తామని ఆ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ తో గంటా శ్రీనివాసరావు భేటీ ‌కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 8 =