బద్వేలు అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90,533 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి మరియు ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన డాక్టర్ దాసరి సుధను, అందుకు సహకరించి కృషిచేసిన పార్టీ నేతలకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. అలాగే బద్వేలు ఫలితాలు అనంతరం చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు కూడా సీఎం వైఎస్ జగన్ ను కలిశారు.
మరోవైపు బద్వేలులో కౌంటింగ్ పూర్తయిన వెంటనే వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధకు ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు అధికారులు ధృవీకరణ పత్రం అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నిష్పక్షపాత పరిపాలన, సామాజిక న్యాయం వల్లే ఈ రోజు ఇంతటి గెలుపు సాధ్యమైందని అన్నారు. బద్వేలులో పోటీచేసేందుకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కు, బద్వేల్ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ