ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 16వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. శుక్రవారం నాడు విద్యాసంస్థల్లో నాడు-నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అలాగే మొదటి విడత నాడు-నేడు పనులను కూడా అప్పుడే ప్రజలకు అంకితం చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాడు-నేడు పనుల్లో అవినీతికి ఎలాంటి తావుండకూడదని చెప్పారు. పిల్లల కోసం నాడు-నేడుతో మంచి కార్యక్రమం చేపట్టామని, పాఠశాలల అభివృద్ధిపై గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదన్నారు. నాడు-నేడు పనులపై చిన్న వివాదం కూడా రాకూడదని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభించిన రోజే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టడం జరగుతుందని, నూతన విద్యా విధానం గురించి కూడా ప్రభుత్వం సమగ్రంగా వివరిస్తుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ