శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్ల జారీపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుని, ఆదివారం నాడు ప్రకటన విడుదల చేసింది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయయడంలో భాగంగా నిలిపివేసిన ఆఫ్ లైన్ టికెట్ల జారీ ప్రక్రియను ఫిబ్రవరి 15వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్టు టీటీడీ పేర్కొంది. ఫిబ్రవరి 16వ తేదీ దర్శనం కోసం 15వ తేదీ ఉదయం 9 గంటలకు టోకెన్లు జారీ చేస్తారని తెలిపారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజ స్వామి సత్రాల్లో ఏర్పాటు చేసే కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేయనున్నామని, భక్తులు ఈ విషయం గమనించగలరని టీటీడీ కోరింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ