ఏపీలో 24 గంటల్లో 5653 కరోనా పాజిటివ్ కేసులు, 35 మరణాలు

Covid-19 in AP : 5653 New Positive Cases, 35 Deaths Reported Today

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 5653 పాజిటివ్ కేసులు, 35 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 10, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,50,517 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 6194 కి పెరిగింది. మరో 6659 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 73,625 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.

కరోనా వలన ప్రకాశంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, కృష్ణాలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, కడపలో ఒకరు మరియు శ్రీకాకుళంలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6194 కి చేరింది.

ఏపీలో కరోనా కేసులు వివరాలు (అక్టోబర్ 10, ఉదయం 10 గంటల వరకు) :

  • రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 64,94,099
  • రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 7,50,517
  • కొత్తగా నమోదైనా కేసులు : 5653
  • నమోదైన మరణాలు : 35
  • డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 6,97,699
  • యాక్టీవ్ కేసులు : 46624
  • మొత్తం మరణాల సంఖ్య : 6194

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 9 =