రాష్ట్రంలో ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉపాధ్యాయుల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. బదిలీలకు సంబంధించిన ఫైలుపై శనివారం నాడు సీఎం వైఎస్ జగన్ సంతకం చేశారు. ఈ అంశంపై రెండు మూడు రోజుల్లో పూర్తీ స్థాయి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఫిబ్రవరి 29, 2020 నాటికీ రెండు ఏళ్ళు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులంతా బదిలీలకు అర్హులుగా ఉండనున్నట్టు తెలుస్తుంది. బదిలీల పక్రియను వెబ్ కౌన్సిలింగ్ ద్వారా చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు ఆమోదం తెలపడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తూ, సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu