ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొంచెం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 6190 కరోనా పాజిటివ్ కేసులు, 35 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 6190 కేసులతో కలిపి సెప్టెంబర్ 29, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 6,87,351 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) 68,429 కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో కరోనా వలన ప్రకాశంలో ఎనిమిది మంది, చిత్తూరులో ఆరుగురు, అనంతపూర్ లో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 5780 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 6,22,136 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 9836 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 59435 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu