ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 96 వేలు దాటింది. కొత్తగా 7627 కేసులు నమోదవడంతో జూలై 26, ఆదివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 96298 కు చేరుకున్నట్టు ప్రకటించారు. మొత్తం కేసుల్లో 93403 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 2895 మంది ఉన్నారు. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా 1041 కి చేరింది. ఇప్పటికి 46301 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో కలిపి మొత్తం 48956 మంది చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
అనంతపూర్ – 9723
చిత్తూరు – 7442
కర్నూల్ – 11570
కడప – 4757
తూర్పుగోదావరి – 13486
పశ్చిమ గోదావరి – 8412
నెల్లూరు – 4354
ప్రకాశం – 3549
గుంటూరు – 10003
కృష్ణా – 5580
శ్రీకాకుళం – 4574
విజయనగరం – 3172
విశాఖపట్నం – 6781
ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు: 2461
విదేశాల నుంచి వచ్చిన వారు: 434
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu