ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. అక్టోబర్ 23, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,00,684 కు, మరణాల సంఖ్య 6544 కు చేరుకుంది. గత 24 గంటల్లో (9AM-9AM) 80,238 కరోనా పరీక్షలు నిర్వహించగా 3765 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన మరో 20 మంది మరణించారు.
రాష్ట్రంలో కరోనా వలన గుంటూరులో నలుగురు, కడపలో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఇద్దరు, కర్నూల్ లో ఒకరు, ప్రకాశంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మరియు పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6554 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 7,62,419 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 4281 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 31721 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu