దసరా పండుగ సందర్భంగా కర్నూల్ జిల్లాలోని దేవరగట్టు కొండ దగ్గర జరిగే కర్రల సమరంకు(బన్నీ ఉత్సవం) ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం కరోనా వ్యాప్తి నేపథ్యంలో వేలాది మంది పాల్గొనే కర్రల సమరంపై నిషేధం విధించారు. వేలాది మంది ఓచోట చేరి కర్రలతో కొట్టుకుంటూ, హింస చోటు చేసుకునే ఈ సమరాన్ని చూసేందుకు బయట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటారు. నిషేధం నేపథ్యంలో దేవరగట్టు కొండకు వెళ్లే దారులను మూసేసి, ఈ రోజు జరిగే ఉత్సవాలకు బయటవారిని అనుమతించకుండా పోలీస్ అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు యువకులు ప్రయత్నం చేసే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతంలోని పలు మండలాలలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నిషేధం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu