విశాఖపట్నం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి వద్ద జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ సైడ్ పిల్లర్ కూలి రహదారిపై వెళ్తున్న వాహనాలపై పడింది. ఈ ప్రమాదంలో ఓ కారు, ట్యాంకర్ ధ్వంసమయ్యాయి. ఈ సమయంలో ఓ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో సైడ్ పిల్లర్ కూలడంతో సమీపంలో ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. మరోవైపు కూలిన పిల్లర్ కింద ఇంకెవరైనా చిక్కుకుని ఉండచ్చేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ