ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 88,378 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 3,042 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 665, పశ్చిమగోదావరిలో 360, చిత్తూరులో 358, ప్రకాశంలో 310, గుంటూరులో 277 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,08,065 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 28 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో ఏడుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, నెల్లూరులో నలుగురు, కడపలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, కృష్ణాలో ఒకరు, ప్రకాశంలో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 12898 కి పెరిగింది. గత 24 గంటల్లో 3,748 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 18,61,937 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 33,230 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ