ధర్మవరం సుబ్బారెడ్డికే బీ ఫామ్ ఇస్తున్నారా?

Is Done TDP Candidate Kotla Surya Prakash Reddy?, TDP Candidate Kotla Surya Prakash Reddy, TDP Candidate, Done Constituency, Done TDP Candidate, Kotla Surya Prakash Reddy, B Form, Dharmavaram Subbareddy,TDP, Latest TDP Candidate News, TDP Candidate List, CM Jagan, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Done constituency, Done TDP candidate, Kotla Surya Prakash Reddy, B form, Dharmavaram Subbareddy,TDP

నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు  ప్రకటించారు. అయితే  అంతకుముందు ఇంచార్జిగా ఉన్న ధర్మవరం సుబ్బారెడ్డి మాత్రం..ఈ ఎన్నికలలో బీఫామ్ తనకే వస్తుందంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. దీంతో అక్కడున్న తెలుగు తమ్ముళ్లలో గందరగోళం ఏర్పడింది.

నంద్యాల జిల్లాలోని  డోన్ నియోజకవర్గంలో  మొదటి నుంచి కోట్ల, కేఈ కుటుంబ సభ్యులే పోటీ చేస్తూ వచ్చారు. అయితే వైఎస్సార్సీపీ ఆవిర్భావంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాకతో డోన్ లోని  రాజకీయం పూర్తిగా మారిపోయిందనే చెప్పొచ్చు. దీంతో పోటీకి  ఎవరూ ముందుకు రాకపోడంతో..చంద్రబాబు   డోన్ ఇంచార్జిగా ధర్మవరం సుబ్బారెడ్డిని ప్రకటించారు. ఆ తర్వాత  మూడేళ్ల క్రితం.. డోన్ నుంచి సుబ్బారెడ్డి పోటీ చేస్తారని, బుగ్గన రాజేంద్రనాథ్‌ను రాజకీయంగా ఎదుర్కొంటారని ప్రకటించారు.

మొదట్లో అంతా బాగానే ఉన్నా మెల్లమెల్లగా టీడీపీలోని ఒక వర్గం సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా పనిచేసింది. ఆయనకు టికెట్ ఇవ్వొద్దని, తమను కాదని ఇస్తే అతనిని ఓడిస్తామని ప్రకటనలు చేయడంతో.. డోన్ అభ్యర్థి వ్యవహారం పూర్తి వివాదాస్పదమయింది. దీంతో  సుబ్బారెడ్డిని కాదని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని ఈ ఎన్నికల బరిలో తమ అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు.

దీంతో సుబ్బారెడ్డి కూడా బల ప్రదర్శన చేయడంతో అతనితో మాట్లాడి పంపారు. కానీ ఆ తర్వాత  సుబ్బారెడ్డి..బీఫామ్ తనకే వస్తుందంటూ బహిరంగంగా ప్రకటించడం సంచలనంగా మారింది. కోట్లను ప్రకటించే ముందు ..డోన్ టికెట్ సుబ్బారెడ్డికి ఇమ్మని, కాదు కోట్ల ఇవ్వాలంటూ పెద్ద దుమారం రేగింది.  చివరకుఫ్లెక్సీలు చించుకుని.. కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. అయితే సుబ్బారెడ్డి  మాటలపై టీడీపీ అధిష్టానం ఏమీ మాట్లాడటం లేదు.

దీంతో సుబ్బారెడ్డికి అసెంబ్లీ టికెట్‌ను ఇచ్చి.. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కర్నూలు ఎంపీ టికెట్ ఇస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కర్నూలు ఎంపీ కాకపోతే..ఆలూరు అసెంబ్లీ ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది.మరోవైపు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మాత్రం ఇప్పటికే డోన్‌లో ప్రచారం విస్తృతం చేస్తున్నారు. మొత్తంగా తెలుగు తమ్ముళ్లు అంతర్యుద్ధంతో డోన్ రాజకీయాలలో కాక పెరిగిపోయింది.  డోన్ నుంచి పోటీ చేసే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో కొద్ది రోజుల్లోనే తేలిపోతుందని అక్కడి వారు అనుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 13 =