ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 765 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో, జూలై 4, శనివారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17699 కి చేరింది. 727 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 32, విదేశాల నుంచి వచ్చిన వారు ఆరుగురు ఉన్నారు. గత 24 గంటల్లో 24,962 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. మొత్తం కేసుల్లో 15141 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 2558 మంది ఉన్నారు.
మరోవైపు కరోనా వలన కర్నూల్ లో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 218 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటికే 8008 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7453 మంది ఆసుపత్రుల్లో, 2020 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 9473 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu