ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో శుక్రవారం జోయాలుక్కాస్ సంస్థ చైర్మన్ అండ్ ఎండీ అలుక్కాస్ వర్గిస్ జాయ్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలపై సీఎం వైఎస్ జగన్ తో అలుక్కాస్ వర్గిస్ జాయ్ చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వపరంగా ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్రంలో అమలులో ఉన్న పారిశ్రామిక విధానం, అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించి, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సీఎంతో జరిగిన సమావేశంలో చైర్మన్ అలుక్కాస్ వర్గిస్ జాయ్ తో పాటుగా సంస్థ సీవోవో హెన్రీ జార్జ్, రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE