ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం రాజమండ్రిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. అలాగే తను ఎంపీగా ఉన్న సమయంలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఈ వైద్య కళాశాలలో నూతన భవనం కోసం చిరంజీవి రూ.2 కోట్లు నిధులను కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆ నూతన భవనాన్ని కూడా చిరంజీవి ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో చిరంజీవితో పాటు అల్లు అరవింద్, ఇతర కుటుంబసభ్యులు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు మురళీమోహన్, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ