పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. ఈ మేరకు ఆయన లేఖను జత చేస్తూ ట్వీట్ చేశారు. “పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, వారి దీక్షలు విరమింపజేయాలని సీఎం వైఎస్ జగన్ కు బహిరంగ లేఖ రాసాను. అందరికీ చట్టప్రకారం పునరావాసం కల్పించాలి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందరికీ ఇవ్వాలి. సీఎం గతంలో ప్రకటించిన 10 లక్షల ప్యాకేజీ అందించాలి. 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలి” అని నారా లోకేష్ పేర్కొన్నారు.
18 సంవత్సరాలు నిండిన వారందరికీ ప్యాకేజీ వర్తింపజేయాలని, నిర్వాసితులకు కేటాయించిన కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. గ్రామాలను ఖాళీ చేయించిన తేదీనే కటాఫ్ తేదీగా పరిగణించాలని, ప్రతిపక్షనేతగా వున్నప్పుడు నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత సీఎంపై ఉందని నారా లోకేష్ అన్నారు.
పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, వారి దీక్షలు విరమింపజేయాలని సీఎం @ysjagan గారికి బహిరంగ లేఖ రాసాను. అందరికీ చట్టప్రకారం పునరావాసం కల్పించాలి.ఆర్&ఆర్ ప్యాకేజీ అందరికీ ఇవ్వాలి. సీఎం గతంలో ప్రకటించిన 10 లక్షల ప్యాకేజీ అందించాలి.(1/3) pic.twitter.com/U7CNVNndMM
— Lokesh Nara (@naralokesh) January 6, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ