ప్రముఖ యువ నటుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి, ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై సోమవారం మధ్యాహ్నం అపోలో ఆసుపత్రి వైద్యులు తాజా మెడికల్ బులెటిన్ ను విడుదల చేశారు. “సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. తదుపరి పరిశీలన మరియు సహాయక సంరక్షణ కోసం అతన్ని ఐసీయూలోనే కొనసాగిస్తున్నాం. రెస్పిరేటరీ సపోర్ట్ అవసరం క్రమంగా తగ్గుతుంది” అని బులెటిన్ లో పేర్కొన్నారు. మరోవైపు పలువురు తెలుగు సినీరంగ ప్రముఖులు అపోలో ఆసుపత్రికి చేరుకొని, సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ