ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సమీర్ శర్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ నూతన సీఎస్ గా సమీర్ శర్మ ఈ రోజు (సెప్టెంబర్ 30, గురువారం) బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఆదిత్యనాథ్ దాస్ నుంచి సమీర్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేయగా, పలువురు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు
ముందుగా ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం సెప్టెంబర్ 30తో ముగియనుండడంతో రాష్ట్ర ప్రణాళికా మరియు రిసోర్స్ మొబలైజేషన్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమీర్ శర్మను నూతన సీఎస్ గా ఎంపిక చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అలాగే పదవీకాలం పూర్తయిన అనంతరం ఆదిత్యనాథ్ దాస్ ను ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీలోని ఏపీ భవన్ నుంచి ఆయన బాధ్యతలు నిర్వర్తించనుండగా, ఆయనకు కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ