కరోనాపై పోరాటం: ఏపీ సీఎం సహాయనిధికి రూ.1.33 కోట్ల విరాళాలు

Andhra, AP CM Relief Fund, AP CM Relief Fund to Fight on Corona, AP Coronavirus, AP Coronavirus Cases, AP Coronavirus News, AP Coronavirus Updates, Contribute to Andhra Pradesh CM Relief Fund, Coronavirus outbreak, donations to CMRF, Fight on Corona, Mango News, Several Organizations Donate 1.33 Crore, Several Organizations Donate 1.33 Crore to AP CM Relief Fund, Several Organizations Donate 1.33 Crore to AP CM Relief Fund to Fight on Corona

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలుసంస్థలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పలు సంస్థలు ప్రభుత్వం చేపట్టే కరోనా నియంత్రణ చర్యల కోసం సీఎం సహాయనిధికి రూ.1,33,34,844 విరాళంగా అందించాయి. ఈ విరాళాలకు సంబంధించిన చెక్కులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు శుక్రవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందించారు.

కాళేశ్వరీ రిఫైనరీ అండ్‌ ఇండస్ట్రీ ప్రై.లిమిటెడ్‌ రూ.25 లక్షలు, ఏపీ ఆయిల్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ పీవీఎస్‌ఎస్‌ మూర్తి రూ.15 లక్షలు, ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్, విజయవాడ రూ.14.20 లక్షలు, వేద సీడ్‌ సైన్స్‌ ప్రై.లిమిటెడ్‌ రూ.10 లక్షలు, భవానీ కాస్టింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.5 లక్షలు, కాకినాడ ట్రస్ట్‌ హాస్పిటల్‌ రూ.1 లక్ష సహా పలు సంస్థలు సీఎం సహాయనిధికి విరాళాలు అందజేశాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + thirteen =