తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలపై అధిక చార్జీలను మోపుతోందంటూ, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో ‘బాదుడే బాదుడు’ పేరుతో గత కొన్ని రోజులుగా ఒక నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు వస్తున్నారు. బుధవారం పర్యటనలో భాగంగా పొందూరు మండలం దళ్లవలస గ్రామంలో నిర్వహించనున్న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత జిల్లా కావడంతో.. ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దీనిని విజయవంతం చేసేందుకు ఆయన జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులను సమీకరిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్ ఈరోజు సాయంత్రం చంద్రబాబు పాల్గొననున్న సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం ద్వారా వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చంద్రబాబు సూచించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ